There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Sun Apr 20, 2025
పరిచయం:
1905 తర్వాత బ్రిటిషు సామ్రాజ్యవాదం మరియు భారత ప్రజలకు స్వేచ్ఛను తీసుకురావడంలో మిత వాదుల విఫల ప్రయత్నాల వలన నిరాశకు గురైన అనేకమంది భారతీయ యువత, దేశభక్తి, ఉత్సాహం మరియు సాయుధ పోరాటాలు మాత్రమే వలస పాలనను అంతం చేయగలవనే నమ్మకంతో విప్లవ జాతీయవాదానికి నాంది పలికారు.
విషయం:
స్వాతంత్య్ర సంగ్రామంలో విప్లవ జాతీయవాదుల పాత్ర
1) కార్యాచరనకు ప్రాముఖ్యత:
a) మితవాద మార్గాల తిరస్కారం: విప్లవ జాతీయవాదులు మితవాదులు ఉపయోగించిన రాజ్యాంగ పద్ధతులను మరియు వారి విధానాలను తిరస్కరించి, విప్లవాత్మక పద్దతులను ఎంచుకున్నారు.
b) సాహసోద్యమంపై ఆసక్తి: సంప్రదింపుల కంటే చైతన్యవంతమైన ప్రతిఘటనే స్వరాజ్యానికి సోపానమని వారు దృఢంగా నమ్మారు.
c) “కరుణ కంటే కర్మకే ప్రాముఖ్యతనివ్వడం”: “ప్రార్థన కంటే కార్యాచరణే ముఖ్యం” అనే వారి నినాదంతో, బ్రిటిష్ పాలనను కూల్చడానికి శారీరక శ్రమకు ప్రాధాన్యమిచ్చారు.
2) రహస్య విప్లవ సంస్థల ఏర్పాటు
a) అనుశీలన సమితి (1902): బెంగాల్లో స్థాపించబడిన ఈ సంస్థ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని బలోపేతం చేసింది.
b) యుగాంతర్ (1906): అనుశీలన సమితితో కలిసి సైనిక చర్యల కోసం సహకరించింది.
c) అభినవ భారత్ (1904): వినాయక దామోదర్ సావర్కర్ స్థాపించిన ఈ సంస్థ సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించింది.
d) హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA) (1924): తర్వాత HSRAగా పేరు మార్చబడి, సోషలిజం మరియు సాయుధ ప్రతిఘటనపై దృష్టి సారించింది.
3) చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన విప్లవ చర్యలు
a) 1908 – అలీపూర్ బాంబు కేసు: ఖుదీరామ్ బోస్ మరియు ప్రఫుల్ల చాకీలు మేజిస్ట్రేట్ కింగ్స్ఫోర్డ్ను హత్య చేయడంలో విఫలమయ్యారు.
b) 1912 – ఢిల్లీ కుట్ర కేసు: రాష్బెహారీ బోస్ వైస్రాయ్ హార్డింగ్పై బాంబు దాడి చేశారు.
c) 1928 – జె.పి. సాండర్స్ హత్య: భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారంగా ఈ చర్య తీసుకున్నారు.
d) 1929 – అసెంబ్లీ బాంబు కేసు: భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్ మరణశిక్షలను వ్యతిరేకిస్తూ కేంద్ర అసెంబ్లీలో బాంబులు విసిరారు.
4) స్వాతంత్ర్య సంగ్రామాన్ని అంతర్జాతీయం చేయడంలో పాత్ర
a) గదర్ ఉద్యమం (1913): ఉత్తర అమెరికాలోని భారతీయ ప్రవాసులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించారు.
b) బెర్లిన్ కమిటీ: మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ మరియు ఇతర సెంట్రల్ పవర్స్ తో కలిసి బ్రిటిష్ నియంత్రణను అస్థిరపరచడానికి పనిచేసింది.
5) భవిష్యత్ ఉద్యమాలకు ప్రేరణ:
a) భవిష్యత్ విప్లవకారులకు స్ఫూర్తి: సుభాష్ చంద్ర బోస్ వంటి నాయకులు విప్లవ జాతీయవాదుల భావజాలం నుండి స్ఫూర్తి పొందారు.
b) సామ్యవాద ఆలోచనల విస్తరణ: HSRA యొక్క 1925 మానిఫెస్టో భారతదేశం సామ్యవాద గణతంత్ర దేశంగా అవతరించాలనే పిలుపునిచ్చి తరువాతి ఉద్యమాలను ప్రభావితం చేసింది.
c) నూతన ప్రతిఘటన పద్ధతులు: వీరి సిద్ధాంతాలు క్విట్ ఇండియా వంటి ఉద్యమాలకు బలమైన పునాదినిచ్చాయి.
బ్రిటిష్ పాలనపై ప్రభావం
1) ప్రతీకార నిర్ణయాలు:
a) రహస్య ఉద్యమాలు: విప్లవ సమూహాలు రహస్య కార్యకలాపాల ద్వారా బ్రిటిష్ అధికారాన్ని అస్థిరపరిచాయి.
b) కఠినమైన చట్టాలు: డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ (1915) మరియు రౌలట్ యాక్ట్ (1919) వంటి కఠిన చర్యలకు దారితీశాయి.
c) నిఘా: విప్లవ కార్యకలాపాలను అరికట్టడానికి అధికారులు నిఘాను తీవ్రతరం చేశారు.
2) బ్రిటిష్ విధానాల్లో మార్పు
a) అణచివేత: విప్లవ చర్యల తర్వాత కఠినమైన నిర్ణయాలు, శిక్షలు బ్రిటీషు వారు అమలు చేసారు.
b) ప్రత్యేక గూఢచార విభాగం: విప్లవకారులను గుర్తించడానికి క్రిమినల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ (CID) స్థాపించబడింది.
c) సమాచారకర్తల వినియోగం: విప్లవ నేతల నెట్వర్క్లను ధ్వంసం చేయడానికి సమాచారకర్తలను ఉపయోగించారు.
3) బ్రిటిష్ ఆధిపత్యానికి సవాలు
a) ప్రతిఘటన: భగత్ సింగ్ వంటి వారి ధైర్యమైన చర్యలు బ్రిటిష్ బలహీనతను నిరూపించాయి.
b) బ్రిటిషు సామ్రాజ్యం అజేయమైనదనే భ్రమను బద్దలు కొట్టడంలో కీలక పాత్ర పోషించారు.
c) ప్రతీకాత్మక ప్రభావం: వీరి సాహసోపేతమైన చర్యలు వలస పాలనకు వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటుకు స్ఫూర్తినిచ్చాయి.
4) ప్రజా చైతన్యం:
a) యువతకు స్ఫూర్తి: విద్యార్థులు మరియు యువకులు స్వాతంత్ర్య సంగ్రామంలో చేరారు.
b) జాతీయ చైతన్యం మేల్కొల్పడం: భారత ఖండమంతటా దేశభక్తి జ్వాలలను వ్యాపింపజేశారు.
c) ధైర్యం మరియు త్యాగం: విప్లవకారులు దేశభక్తి మరియు నిస్వార్థతకు చిహ్నాలుగా నిలిచారు.
d) భవిష్యత్ ఉద్యమాలపై ప్రభావం: వారి త్యాగాలు తరువాతి ప్రజా ఉద్యమాలకు ప్రేరణగా నిలిచాయి.
ముగింపు:
విప్లవ జాతీయవాదులు బ్రిటిష్ పాలనను సవాలు చేయడమే కాకుండా ఏ భయం భీతి ఎరుగని ప్రజా చైతన్యానికి ఊతమిస్తూ మన దేశ స్వాతంత్య్ర పోరాటంపై చెరగని ముద్ర వేశారు. వీరి త్యాగాలు భారత జాతి స్వేచ్చా ప్రయాణంలో అమర దీపాలుగా ప్రకాశిస్తాయి.
Additional Embellishment: